క్రైమ్/లీగల్

నలుగురు దుర్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇటిక్యాల, నవంబర్ 11: దైవదర్శనానికి వెళ్ళి కారులో వస్తుండగా రోడ్డు ప్రమాదం జరిగి నలుగురు మృతి చెందిన ఘటన ఆదివారం తెలంగాణ రాష్ట్రంలోని జోగుళాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండల పరిధిలో చోటు చేసుకుంది. కోదండాపురం ఎస్సై వస్తన్రాయక్, స్థానికుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. సికింద్రాబాద్ నుంచి రెండు రోజుల క్రితం దైవదర్శనం చేసుకునేందుకు తిరుపతి వెళ్లి తిరిగు ప్రయాణంలో సికింద్రాబాద్‌కు వెళ్తుండగా ప్రమాదవశాత్తు 44వ జాతీయ రహదారి కారు అదుపుతప్పి గొర్రెల కాపరిని ఢీకొట్టి, పక్కనే ఉన్న వేప చెట్టును ఢీకొంది. దీంతో ఇటిక్యాల మండల పరిధిలోని కోదండాపురం గ్రామానికి చెందిన గొర్లకాపరి కుర్వ రాధాకృష్ణ (37)తో పాటు కారులో ప్రయాణిస్తున్న సికింద్రాబాద్ పట్టణానికి చెందిన మహేష్ (40) అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. కారు డ్రైవర్ యాదగిరితో పాటు మరో ఏడుగురికి తీవ్రగాయలయ్యాయి. వారిని చిక్సిత నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతుడు మహేష్ కూతురు వైష్ణవి (7), డ్రైవర్ యాదగిరి కూతురు హారిక (12) ఆసుపత్రిలో మృతి చెందినట్లు ఎస్సై వస్రనాయక్ తెలిపారు. మహేష్ భార్య స్వప్న, డ్రైవర్ యాదగిరి, స్వాతి, నితిన్, ఆఖిల చిక్సిత పొందుతున్నట్లు ఆయన తెలిపారు. మృతి చెందిన వారిని పోస్టుమార్టం నిమిత్తం ప్రైవేట్ వాహనంలో అలంపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అదేవిధంగా గొర్రెల కాపరి రాధాకృష్ణకు భార్య గోపాలమ్మతో పాటు ఇద్దరు కూతుర్లు, ఒక కుమారుడు ఉన్నట్లు స్థానికులు తెలిపారు. ప్రమాద ఘటనపై కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వస్తన్రాయక్ తెలిపారు.

చిత్రం.. ప్రమాదానికి గురైన కారు