క్రైమ్/లీగల్

పసిపాపను గొంతు నులిమి చంపిన కసాయి తండ్రి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చౌటుప్పల్, నవంబర్ 12: భార్య ఆడబిడ్డకు జన్మనిచ్చిందని ఆగ్రహించిన కసాయి తండ్రి సదరు పసికందును గొంతు నులిమి హత్య చేసిన సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం ఎల్లగిరి గ్రామంలో జరిగింది. వివరాలలోకి వెళ్తే... మండల పరిధిలోని దేవలమ్మనాగారం గ్రామానికి చెందిన దంపతులు సిలివేరు శివ, అక్షరలు ఎల్లగిరి శివారులో కూరగాయల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. అప్పుడే పిల్లలు వద్దని భర్త, కావాలని భార్య పట్టుబట్టడంతో ఇరువురి మధ్య తరుచు ఘర్షణలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో భార్య గర్భం దాల్చడంతో అబార్షన్ చేయించుకోవాలని వత్తిడి చేశాడు. దీనికి భార్య ససేమిరా అంది. పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. పిల్లలు పుట్టడం ఇష్టం లేని సిలివేరు శివ మూడు నెలల కుమార్తె నిహారికను ఆదివారం సాయంత్రం గొంతు నులిమి చంపే ప్రయత్నం చేసాడు. గమనించిన కుటుంబ సభ్యులు అడ్డుకోని చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున మరణించింది. సమాచారం అందుకున్న సీఐ వెంకటేశ్వర్లు సంఘటన ప్రాంతానికి చేరుకొని విచారణ నిర్వహించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
చిత్రం.. పసికందు మృతదేహం