క్రైమ్/లీగల్
పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 13 November 2018
టంగుటూరు, నవంబర్ 13 : పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని కాకుటూరివారిపాలెం లో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం టంగుటూరు మండలంలోని కాకుటూరివారిపాలెం గ్రామానికి చెందిన గూడూరి సుబ్బారావు అనే రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక, అప్పులబాధ తట్టుకోలేక మద్యానికి బానిసై సోమవారం రాత్రి ఇంట్లో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వెంటనే రంగారావును 108 వాహనంలో ఒంగోలు రిమ్స్కు తరలిస్తుండగా మార్గమధ్యలో సుబ్బారావు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. అతని భార్య ఫిర్యాదు మేరకు స్థానిక ఎస్ఐ హజరత్తయ్య కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.