క్రైమ్/లీగల్

రోడ్డు ప్రమాదంలో అయ్యప్ప దీక్షాపరుడు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేదరమెట్ల, నవంబర్ 13 : పాదయాత్రగా నడిచి వెళుతున్న అయ్యప్ప దీక్షాపరుడ్ని వెనుక నుండి స్కూటీ ఢీకొన్న ప్రమాదంలో తల లోపలి భాగాలు దెబ్బతిని అయ్యప్ప భక్తుడు మృతి చెందిన సంఘటన మంగళవారం జరిగింది. వివరాల్లోకి వెళితే కొరిశపాడు మండలం బొడ్డువానిపాలెం గ్రామానికి చెందిన అన్యం సుబ్బరామిరెడ్డి అనే వ్యక్తి 20 రోజుల క్రితం అయ్యప్ప మాలను ధరించారు. కార్తీకమాసం తొలి సోమవారం సందర్భంగా శింగరకొండలో సోమవారం సాయంత్రం అయ్యప్ప భజన జరుగుతుందనే సమాచారం తెలుసుకున్నాడు. దీంతో సోమవారం సాయంత్రం శింగరకొండలో భజనకు పాల్గొనేందుకు గ్రామం నుండి సాయంత్రం ఐదు గంటల సమయంలో తోటి అయ్యప్ప భక్తులతో పాదయాత్రగా బయలుదేరాడు. ఈ క్రమంలో అద్దంకి దాటిన తరువాత హెచ్‌బి పెట్రోల్ బంకు ఎదురుగా వెనుక నుండి ఒక వ్యక్తి ఫ్లూటుగా మద్యం సేవించి స్కూటీతో సుబ్బరామిరెడ్డిని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో సుబ్బరామిరెడ్డి రోడ్డు పై పడి తల లోపలి భాగాలు దెబ్బతినడంతో స్పృహ కోల్పోయాడు. తోటి అయ్యప్ప భక్తులు సుబ్బరామిరెడ్డి బంధువులకు సమాచారం అందించి స్పృహ కోల్పోయిన అయ్యప్ప దీక్షాపరుడ్ని ముందుగా అద్దంకిలోని ఓ ప్రైవేట్ వైద్యశాలలో ప్రధమ చికిత్స నిమిత్తం చేర్పించారు. అనంతరం బంధువులు మెరుగైన చికిత్స కోసం ఒంగోలుకు తరలించగా అక్కడ ఒక ప్రముఖ ప్రైవేట్ వైద్యశాలలో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం సుబ్బారామిరెడ్డి (55) మృతి చెందాడు. అద్దంకి పోలీసులు మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఒంగోలు రిమ్స్‌కు తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఏది ఏమైనా దీక్షలో ఉన్న అయ్యప్ప స్వామి భక్తి భావంతో పాదయాత్ర చేస్తూ రోడ్డు ప్రమాదంలో మరణించడాన్ని అయ్యప్ప భక్తులే కాకుండా పరిసర గ్రామస్థులను, బంధువులను శోక సముద్రంలో ముంచెత్తింది.