క్రైమ్/లీగల్

తొమ్మిదేళ్ల బాలుడి హత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నకిరేకల్, నవంబర్ 13: ఇంటి ముందు సరదాగా ఆడుకుంటున్న తొమ్మిదేళ్ల బాలుడిని కిడ్నాప్ చేసి కొట్టి చంపి ఇంటి రేకులపై పడవేసిన దారుణ సంఘటన నకిరేకల్‌లో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసులు, కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం నకిరేకల్‌లోని మార్కెట్‌రోడ్డులో గల వడ్డెర కాలనీ సమీపంలో నివాసం ఉంటున్న రాపోలు రమేష్ వాణిలకు సాత్విక్ (9), రుత్విక్ (5) ఇద్దరు కుమారులు ఉన్నారు. కుమారులు ఇద్దరు స్థానిక ఏవీఎం టాలెంట్ పాఠశాలలో చదువుతున్నారు. రమేష్ ఇంటి వద్ద మగ్గం పని చేస్తూ, భార్య వాణి స్థానికంగా ఒక ఉన్న రామకృష్ణ వస్త్ర దుకాణంలో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. రోజు మాదిరిగా వాణి వస్త్ర దుకాణానికి వెళ్లగా రమేష్ మగ్గం నేస్తూ పనిలో ఉన్నాడు. సోమవారం సాయంత్రం 5.30 గంటల సమయంలో పెద్ద కుమారుడు సాత్విక్ ఇంటి ముందు ఆడుకుంటూ కనిపించకుండా పోయాడు. అతని సోదరుడు రుత్విక్ తండ్రికి అన్నయ్య కనిపించడం లేదని తెలియజేయడంతో అతడు ఇంటి పరిసర ప్రాంతాలలో సాత్విక్ కోసం గాలించాడు. రమేష్ స్నేహితుల సహాయంతో కుమారుడు సాత్విక్ కనపడుటలేదని సోషల్ మీడియాలో ఫోటోను కూడా షేర్ చేశాడు. ఈ మేరకు రాత్రి స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసి అర్ధరాత్రి ఒంటి గంట వరకు కుమారుడి కోసం గాలించారు. మంగళవారం గాలిస్తుండగా ఉదయం 8.30 గంటల సమయంలో రమేష్ ఇంటి రేకులపై సాత్విక్ మృతదేహం ఉన్నట్లు పక్కింట్లో ఉంటున్న విజయ్‌కుమార్ రమేష్‌కు సమాచారం ఇచ్చాడు. వెంటనే రమేష్ ఇంటి పైకి ఎక్కి చూడగా శరీరంపై దెబ్బలతో గొంతు కోసి చేతి గోర్లు పీకి చేతులపై కోసిన గాయాలతో సాత్విక్ మృతిచెంది ఉన్నాడు. సాత్విక్ మృతదేహాన్ని కిందకి దింపారు. సాయంత్రం వరకు ఆడుకుంటూ తిరిగిన కుమారుడు మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. సంఘటన స్థలానికి స్థానిక సీఐ గౌరి నాయుడు, ఎస్‌ఐ హరిబాబు చేరుకుని బాలుడి మృతికి సంబంధించిన వివరాలను పరిశీలన చేస్తున్నట్లు తెలిపారు. గుర్తుతెలియని దుండగులు బాలుడిని కొట్టి చంపి మళ్లీ తీసుకువచ్చి వారి ఇంటి రేకులపై పడవేశారని తెలిపారు. తండ్రికి కూడా ఎవరి మీద అనుమానం లేదని చెబుతున్నాడని ఈ మేరకు కేసు నమోదుచేసి విచారణ చేస్తున్నామని తెలిపారు. బాలుడి మృతదేహాన్ని స్థానిక మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం సందర్శించి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.