క్రైమ్/లీగల్

విద్యుదాఘాతంతో నేత కార్మికుడి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందూపురం టౌన్, నవంబర్ 14 : మున్సిపల్ పరిధిలోని ముద్దిరెడ్డిపల్లి పాత ఊరులో నేత కార్మికులు సాయికుమార్ (22) బుధవారం విద్యుదాఘాతంతో మృతి చెందాడు. మగ్గం నేస్తున్న సమయంలో ట్యూబ్‌లైట్ తగిలి విద్యుదాఘాతంతో జరగడంతో వెంటనే యజమాని చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కాగా మగ్గం నేస్తున్న సమయంలో ఉన్నఫళంగా విద్యుత్ సరఫరా జరిగి సాయికుమార్ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అదేవిధంగా ప్రతి మరమగ్గానికి యజమాని ఎర్త్ ఏర్పాటు చేయాల్సి ఉండగా అలా చేయకపోవడం వల్లే ప్రమాదం సంభవించినట్లు కొందరు భావిస్తున్నారు. వన్‌టౌన్ పోలీసులు యజమాని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు.