క్రైమ్/లీగల్

పరిహారం అందకపోవడంతో రైతు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సోంపేట, నవంబర్ 16: నెల రోజులు క్రితం సంభవించిన తిత్లీ తుపాన్ వల్ల మూడు ఎకరాల కొబ్బరి, జీడి పంటలు కోల్పోయి నష్టపరిహారం అందకపోవడంతో మనస్తాపానికి గురై మండలంలో సిరిమామిడి గ్రామానికి చెందిన కె.గణపతి(55) శుక్రవారం మృతి చెందారు. తొలి విడత ఆన్‌లైన్‌లో తన పేరు లేకపోవడం, అదే జీవనాధారంగా కుటుంబాన్ని నెట్టుకువస్తున్నా గణపతి మనస్తాపానికి గురై రెండు రోజులు జ్వరంతో బాధపడి మృతి చెందాడు. మృతుడుకు భార్య ఊర్వశి, ఇద్దరు కుమారులు, కుమార్తెలున్నారు. జడ్‌పీటీసీ చంద్రమోహన్ ఆ కుటుంబాన్ని పరామర్శించి ప్రభుత్వం నుంచి సహాయం అందేలా కృషి చేస్తానన్నారు.