క్రైమ్/లీగల్
బస్సు ఢీకొని యువకుని మృతి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Sunday, 18 November 2018
కొత్తవలస, నవంబర్ 17: మండలంలోని ఎపి మోడల్ స్కూల్ సమీపంలో పెదగొప్ప వద్ద శనివారం ఉదయం జరిగిన ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు. వివరాలు ఇలా ఉన్నాయి. కాటకాపల్లి గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు, మాజీ సర్పంచ్ రెడ్డి పైడినాయుడు చిన్నకుమారుడు రెడ్డి సత్యశివ(26) ఆర్టీసీ బస్సు ఢీకొన్న ప్రమాదంలో అక్కడికక్కడే మృతి చెందాడు. విజయనగరం నుండి అనకాపల్లి వస్తున్న బస్సు అదే మార్గంలో కాటకాపల్లి నుండి కొత్తవలసకు బైక్పై వెళుతున్న శివను వెనుకనుంచి ఢీకొట్టడంతో శివఅక్కడే మరణించాడు. మృతుడు శివ ఆంధ్రాయూనివర్సిటీలో చదివి ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడని స్థానికులు తెలిపారు. జరిగిన సంఘటనపై హెచ్సి శ్రీనివాసరావు కేసు నమోదు చేసి దార్యప్తు చేస్తున్నారు.