క్రైమ్/లీగల్

మరణంలోనూ వీడని భార్య భర్తల బంధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బత్తలపల్లి, నవంబర్ 18: భార్య మృతి చెందిన వార్త తెలుసుకున్న భర్త ఆత్మహత్యాయత్నం చేసుకున్న సంఘటన బత్తలపల్లిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే బత్తలపల్లిలోని ఓ పాత్రికేయుని ఇంట తల్లి, తండ్రి ఇరువురు గంటల వ్యవధిలోనే మృత్యువాతపడడంతో ఆ పాత్రికేయుని ఇంట తీవ్ర విషాదం నెలకొంది. బత్తలపల్లికి చెందిన వడ్డే వెంకటస్వామి (80), భార్య వడ్డే శివమ్మ (60) ఆదివారం మృతి చెందారు. వడ్డే శివమ్మ గత కొంతకాలంగా గుండెజబ్బుతో బాధపడుతుండగా మూడు రోజుల క్రితం కిమ్స్ సవేరా ఆసుపత్రిలో బైపాస్ సర్జరీ చేయించారు. నాటి నుండి ఐసీయూలో ఉన్న శివమ్మ ఆదివారం వేకువజామున మరోసారి గుండెపోటుకు గురై మృతి చెందింది. ఈ విషయాన్ని కుమారుడు నాగేష్, రాధాకృష్ణ తండ్రి వడ్డే వెంకటస్వామికి సమాచారం అందించారు. విషయం తెలియగానే భర్త వడ్డే వెంకటస్వామి ఊజీ మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు, స్థానికులు గమనించి స్థానిక ఆర్డీటీ ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందాడు. గంటల వ్యవధిలోనే భార్య భర్తలు ఇరువురు మృతి చెందడంతో కుటుంబ సభ్యులతోపాటు బంధువులు, స్నేహితులు కన్నీటిపర్యంతమయ్యారు.
* ఎమ్మెల్యే నివాళి...పలువురి సంతాపం...
పాత్రికేయుని తల్లిదండ్రులు మృతి చెందిన విషయాన్ని తెలుసుకున్న ధర్మవరం ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ ఆదివారం శివమ్మ ఇంటికి వెళ్లి మృతదేహం వద్ద పూలమాలలు వేసి నివాళులర్పించారు. వెంటనే అక్కడి నుండి అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి వెంకటస్వామి మృతదేహం వద్ద నివాళులర్పించారు. వారితోపాటు టీడీపీ, వైకాపా నేతలు, వివిధ శాఖల అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు నివాళులర్పించి పాత్రికేయుడ్ని ఓదార్చారు.