క్రైమ్/లీగల్

ఖాజాగూడలో కారు బీభత్సం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గచ్చిబౌలి, డిసెంబర్ 9: ఖాజాగూడలో కారు బీభత్సం సృష్టించింది. మోటర్ సైకిల్‌పై వెళ్తున్న వారితో పాటు రోడ్డు పక్కన ఆపి ఉన్న మరో మూడు కార్లను ఢీ కొట్టింది. సంఘటనలో మోటరు సైకిల్‌పై వెళ్తున్న వారిలో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయ. సంఘటన రాయదుర్గం పోలీసు స్టేషన్ పరిధిలోని ఖాజాగూడలో జరిగింది. ప్రమాదానికి సంబంధించి రాయదుర్గం పోలీసుల కథనం ప్రకారం.. బీహార్‌కు చెందిన హిమ్‌రాజ్ కుమార్ ఖాజగూడలో నివాసముంటూ నగరంలోని ఓ నిర్మాణ సంస్థలో సివిల్ ఇంజనీర్‌గా పని చేస్తున్నాడు. హిమ్‌రాజ్‌ని చూసేందుకు తండ్రి కృష్ణ దేవప్రసాద్ (80) ఆదివారం ఉదయం వచ్చాడు. చాల దూరం నుంచి వచ్చిన తండ్రిని బయటకు తీసుకు వెళ్దామని మోటరు సైకిల్‌పై బయలు దేరాడు. ఇంటి నుంచి బయలు దేరిన తండ్రీ కుమారులు ఖాజగూడ ఆగ్రా స్వీట్ హౌస్ వద్దకు వచ్చే సరికి వెనుక నుంచి వేగంగా వచ్చిన స్వీఫ్ట్ డిజైర్ కారు మోటరు సైకిల్‌ని ఢీ కొట్టడంతో ఆగ్రా స్వీట్ హౌస్ ఎదురుగా నిలిపి ఉన్న మరో మూడు కార్లను సెక్యూరిటీ గార్డు మహ్మద్ ఖలీమ్ (48)ని ఢీ కొట్టింది. సంఘటనలో కృష్ణ దేవ ప్రసాద్ అక్కడక్కడే మృతి చెందగా హిమ్‌రాజ్‌తో పాటు స్వీట్ హౌస్ సెక్యూరిటీ గార్డు మహ్మద్ ఖలీమ్‌కు తీవ్రగాయాలయ్యాయ. గాయపడ్డ హిమ్‌రాజ్, ఖలీమ్‌లను సమీపంలోని సన్‌షైన్ ఆసుపత్రికి తరలిచారు. రాయదుర్గం ఎస్‌ఐ మురళిధర్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.