క్రైమ్/లీగల్

క్రిమి సంహారక మందు తాగి వివాహిత ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, డిసెంబర్ 10: చంద్రగిరి మండలం, అక్కగారి కాలనీకి చెందిన నీలిమ (20) అనే వివాహిత సోమవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. తన కుమార్తె మృతికి అత్తింటి వరకట్న వేధింపులే కారణమని నీలిమ తండ్రి పాపిరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మేస్ర్తిపని చేసుకుని జీవిస్తున్న పాపిరెడ్డి పెద్ద కుమార్తె నీలిమను కొత్త చానంబట్లకు చెందిన వెంకటరత్నం రెడ్డి కుమారుడు మునిరెడ్డితో ఐదు సంవత్సరాల క్రితం వివాహమైంది. వీరికి ప్రణీత్, జాహ్నవి అనే ఇద్దరు పిల్లలున్నారు. వివాహ సమయంలో కట్నంగా 70వేలు నగదు, 15 సవర్ల బంగారు ఆభరణాలు ఇచ్చారు. పెళ్లయిన అరు నెలల వరకు నీలిమ ఆనందంగానే ఉన్నా ఆ తరువాత అత్తంటివారి కట్నం వేధింపులు పెరిగాయి. పెద్ద సమక్షంలో పంచాయతీలు జరిగాయి. దీంతో మనస్తాపానికి గురైన నీలిమ సోమవారం ఇంటిలో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికులు గుర్తించి వెంటనే ఆమెను ప్రభుత్వాస్పత్రికి తరలించి, తండ్రి పాపిరెడ్డికి సమాచారం అందించారు. అప్పటికే ఆమె తుదిశ్వాస విడిచింది. తన కుమార్తె ఆత్మహత్యకు కారణం ఆమె భర్త మునిరెడ్డి, మామ వెంటరత్న రెడ్డి, అత్త అమ్ములు వేధింపులే కారణమంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. చంద్రగిరి పోలీసులు ఈమేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం ఎస్వీ మెడికల్ కళాశాలకు తరలించారు.