క్రైమ్/లీగల్

రోడ్డు ప్రమాదంలో దంపతుల దుర్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మడకశిర, డిసెంబర్ 11: మండల పరిధిలోని వైబీ హళ్ళి ప్రధాన రహదారిలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ట్రాక్టర్, ద్విచక్ర వాహనం ఢీకొన్న సంఘటనలో భార్య భర్తలు రంగస్వామి (40), నాగరత్నమ్మ (28)లు దుర్మరణం చెందారు. ఇందుకు సంబంధించి వివరాలు ఉన్నాయి. వైబీ హళ్ళికి చెందిన నాగరత్నమ్మ పరిగిలో ఉన్న గార్మెంట్ ఫ్యాక్టరీలో పనిచేస్తోంది. రోజూ ఆటోలో వెళ్లే నాగరత్నమ్మ భర్త రంగస్వామిని ద్విచక్ర వాహనంలో మడకశిర వరకు వదలమని కోరింది. దీంతో ఇరువురు ద్విచక్ర వాహనంలో మడకశిరకు బయలుదేరగా పత్తికుంట వద్ద వస్తున్న ట్రాక్టర్‌ను ఢీకొనడంతో రంగస్వామి, నాగరత్నమ్మల తలలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందారు. మృతులకు అర్చన (7), అభి (5) సంతానం ఉన్నారు. విషయం తెలిసిన వెంటనే సీఐ దేవేంద్రకుమార్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.