క్రైమ్/లీగల్
రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 12 December 2018
పుత్తూరు, డిసెంబర్ 12: రోడ్డు దాటుతుండగా మినీ వ్యాన్ ఢీకొనడంతో ఒక వ్యక్తి మృతి చెందిన సంఘటన పుత్తూరు మండల పరిధిలో చోటుచేసుకుంది. బంధువుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మండల పరిధిలోని శిరుగురాజుపాలెం దళితవాడకు చెందిన చెంగల్రాయులు (32) బుధవారం సాయంత్రం గొల్లపల్లి ప్రభుత్వ పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్న తన కుమార్తె ప్రసన్నను తీసుకుని వస్తుండగా గొల్లపల్లి చెక్పోస్టు వద్ద నగరి నుంచి తిరుపతి వైపు వెళుతున్న మినీ వ్యాన్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో చెంగల్రాయులు అక్కడికక్కడే మృతి చెందగా, ప్రసన్నకు గాయాలయ్యాయి. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పుత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.