క్రైమ్/లీగల్

రాజబావి కనుమవద్ద రోడ్డు ప్రమాదం :ఇద్దరు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెదురుకుప్పం, డిసెంబర్ 12: మండలంలోని రాజబావి కోన వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతిచెందినట్లు ఎస్‌ఐ రామకృష్ణ తెలిపారు. పెనుమూరు మండలం బొంతివంక గ్రామానికి చెందిన బి.లోకనాథ నాయుడు (60), బి.సుబ్రహ్మణ్యం నాయుడు (61) తిరుపతి నుంచి తమ గ్రామానికి ద్విచక్ర వాహనంపై వెళుతుండగా తమిళనాడు నుంచి వస్తున్న టీఎన్ 01 ఏవీ 4266 నెంబరుగల కారు అతివేగంగా వచ్చి ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. సంఘటనాస్థలంలోనే సుబ్రహ్మణ్యం నాయుడు మరణించగా, తీవ్రంగా గాయపడిన లోకనాథం నాయుడును తిరుపతి రుయా వైద్యశాలకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మరణించాడు. ఈ మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. లోకనాథం నాయుడుకు ఇద్దరు కుమారులు ఉండగా సుబ్రహ్మణ్యం నాయుడుకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.