క్రైమ్/లీగల్

రూ.80 లక్షల విలువైన ఎర్రచందనం పట్టివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వడమాలపేట, డిసెంబర్ 12: తమిళనాడుకు అక్రమంగా తరలిస్తున్న రూ. 80 లక్షల విలువ గల 30 ఎర్ర చందనం దుంగలను టాస్క్ఫోర్స్ అధికారులు బుధవారం పట్టుకున్నారు. చిత్తూరు జిల్లా రేణిగుంట మండలం మామండూరు అటవీ ప్రాంతం నుంచి ఎర్రచందనం దుంగలను తమిళనాడుకు మినీ లారీలో తరలిస్తున్నట్లు రహస్య సమాచారం అందడంతో ఐజీ కాంతారావు ఆదేశాల మేరకు తిరుపతి టాస్క్ఫోర్స్ అధికారులు బుధవారం తెల్లవారుజామున కరకంబాడి వద్ద కాపుకాశారు. ఎర్రచందనం దొంగలు వీరిని తప్పించుకొని పుత్తూరు వైపు వేగంగా వెళ్తుండగా టాస్క్ఫోర్స్ అధికారులు వీరిని వెంబడించారు. వడమాలపేట సమీపంలో పూడి మార్గంలోకి వెళ్తుండగా పూడి వద్ద గేటు వేసి ఉండటంతో గ్రామంలోకి వెళ్లి ప్రాథమిక పాఠశాల గోడను ఢీకొట్టి అక్కడే వాహనాన్ని వదిలి పారిపోయారు. టాస్క్ఫోర్స్ అధికారులు మినీ లారీని, అందులో ఉన్న 30 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకొని వడమాలపేట పోలీస్‌లకు స్వాధీనం చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు టాస్క్ఫోర్స్ అధికారులు తెలిపారు.