క్రైమ్/లీగల్

ఐఏఎస్ అధికారి సహా ఇద్దరు దుర్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి: తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లా కోదాడ వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇరువురు ఏపీ సచివాలయ ఉద్యోగులు దుర్మరణం చెందగా మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఏపీ సచివాలయంలో బాధ్యతలు నిర్వహిస్తున్న ఐఏఎస్ అధికారి మన్మోహన్‌సింగ్, సెక్షన్ ఆఫీసర్ హరికృష్ణ, పీఎస్ భాస్కర్, ఎన్నికల సంఘం ఎస్‌ఒగా పనిచేస్తున్న విజయలక్ష్మి తదితరులు హైదరాబాద్ నుంచి సోమవారం ఉదయం వెలగపూడి సచివాలయానికి ఇన్నోవా కారులో బయల్దేరారు. ప్రమాదవశాత్తు నల్గొండ జిల్లా కోదాడ వద్ద కారు అదుపు తప్పి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో మన్మోహన్‌సింగ్‌తో పాటు సెక్షన్ ఆఫీసర్ హరికృష్ణ అక్కడికక్కడే మృతిచెందగా కారు డ్రైవర్ ఖలీద్, విజయలక్ష్మి, జలవనరులశాఖ ఏఎస్‌ఒ పాపయ్య, ఏఎస్ రఘువీరాంజనేయులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కోదాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రమాద ఘటనతో సచివాలయంలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఈ దుర్ఘటన పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తంచేశారు. ఉద్యోగుల కుటుంబాలకు అన్ని విధాల అండగా ఉంటామన్నారు. మృతి చెందిన ఉద్యోగుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు.

చిత్రం..బోల్తాపడిన వాహనం