క్రైమ్/లీగల్

నగల కోసం దారుణం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధర్మవరం, డిసెంబర్ 18: కొండవీడు ఎక్స్‌ప్రెస్ రైలులో ఓ దొంగ నగల కోసం ఘోరానికి పాల్పడ్డాడు. బంగారు గొలుసు కోసం ఓ గర్భిణిని రైలు నుంచి కిందకు తోసేశాడు. తీవ్ర గాయాలతో బాధితురాలు ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. అనంతపురం జిల్లా ధర్మవరం రైల్వేస్టేషన్ సమీపంలోని గొల్లపల్లి వద్ద మంగళవారం తెల్లవారుజామున ఈ సంఘటన జరిగింది. మచిలీపట్నం నుంచి బెంగళూరుకు వెళ్తున్న కొండవీడు ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్న గర్భిణి దివ్యను కిందకు తోసేసిన దొంగ అనంతరం ఆమె మెడలోని గొలుసు లాక్కుని పారిపోయాడు. గుంటూరు జిల్లా పిడుగురాళ్లకు చెందిన కరుణాటి దివ్య తన అత్త సుబ్బలక్ష్మితో కలసి బెంగళూరులో ఉన్న భర్త సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ శ్రీనివాస్ వద్దకు కొండవీడు ఎక్స్‌ప్రెస్‌లో బయలుదేరింది. మంగళవారం తెల్లవారుజామున రైలు గొల్లపల్లి వద్ద నెమ్మదిగా వెళ్తుండగా దివ్య బాత్‌రూమ్‌కు వెళ్లింది. వెనుక నుంచి వచ్చిన ఓ దొంగ ఆమె మెడలోని గొలుసు లాక్కునేందుకు ప్రయత్నించారు. దివ్య ప్రతిఘటించడంతో రైలులోంచి కిందికి తోసేశారు. అనంతరం తానూ కిందకు దూకి దివ్య మెడలోని బంగారు గొలుసు లాక్కుని పారిపోయాడు. స్థానికులు గమనించి 108కు సమాచారం అందించారు. 108 సిబ్బంది అక్కడికి చేరుకుని దివ్యను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దివ్యతో పాటు వచ్చిన అత్త సుబ్బలక్ష్మి రైల్వే పోలీసుల సాయంతో అనంతపురం చేరుకున్నారు. ఈ సంఘటనపై రైల్వే సీఐ మోహన్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

చిత్రం..ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న దివ్య