క్రైమ్/లీగల్

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోటవురట్ల, జనవరి 16: మండలంలో కె.వెంకటాపురం విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడు దుర్మరణం చెందగా మరో వ్యక్తి తీవ్రంగా గాయపడి విశాఖ కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్నాడు. ఈసంఘటనకు సంబంధించి స్థానిక ఎస్సై మధుసూధనరావు అందించిన వివరాలిలా ఉన్నాయి. మండలంలో రాజుపేటకు చెందిన యువకుడు మళ్ళ సోమేశ్వరరావు స్వగ్రామం నుంచి బైక్‌పై కె. వెంకటాపురం వెళ్తుండగా ఎదురుగా మోపెడ్‌పై వస్తున్న కాళ్ళ మహాలక్ష్మి సబ్ స్టేషన్ వద్ద ఢీ కొన్నాడు. ఈప్రమాదంలో సోమేశ్వరరావు అక్కడకిక్కడే మృతి చెందగా మహాలక్ష్మి తీవ్రంగా గాయపడ్డాడు. తీవ్రంగా గాయపడిన మహాలక్ష్మిని 108లో నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి తరలించగా ప్రాథమిక చికిత్స చేసి మెరుగైన వైద్య సేవలకై కేజీహెచ్‌కు తరలించారు. ఈమేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై మధుసూధనరావు తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో మహిళకు తీవ్రగాయాలు
కశింకోట, జనవరి 16: స్థానిక కొలంశెట్టి త్రివేణి (30) అనకాపల్లి వైపు నుండి కశింకోట తన భర్త బైక్‌పై బుధవారం వస్తుండగా వెనుక నుండి లారీ బలంగా డీ కొంది. దీంతో బైక్‌పై నుండి త్రివేణి రోడ్డుపై పడిపోవడంతో లారీ తన కాళ్లపైకి వచ్చింది. దీంతో ఆమె రెండు కాళ్లు నుజ్జునుజ్జు అవ్వడంతో స్థానికులు వెంటనే అనకాపల్లి ఆసుపత్రికి హుటాహుటీన తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో విశాఖ కెజిహెచ్‌కు త్రివేణిని తరలించారు. ఈ ప్రమాదం కశింకోట-పసినికాడ గ్రామాల సమీపంలో జరగడంతో అనకాపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.