క్రైమ్/లీగల్

శారీరక వాంఛ తీర్చాలంటూ మహిళపై దాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పూసపాటిరేగ, జనవరి 17: మండలంలోని అల్లాడపాలెం గ్రామంలో ఎస్సీ కులానికి చెందిన మహిళపై అదే గ్రామానికి చెందిన అడ్డగర్ల శ్రీను కత్తితో భర్మాంగంపై దాడి చేయడంతో బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసునమోదు చేశారు. ఎస్సై బాలాజీ రావు అందించిన వివరాల ప్రకారం అల్లాడపాలెం గ్రామానికి చెందిన 30 ఏళ్ళ మహిళతో అదే గ్రామానికి చెందిన శ్రీనుతో పరిచయం ఏర్పడింది. తరువాత ఆమెను శారీరక వాంఛతీర్చాలంటూ వేధించేవాడు. శ్రీనుతో ఆ మహిళ ససేమెర అనడంతో బుధవారం ఆమె వ్యవసాయ క్షేత్రంలో పశువులు కాస్తుండగా శ్రీను ఆమెపై అసభ్యకరంగా వ్యవహరించి కత్తితో మర్మాంగాన్ని కోశాడు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అట్రాసిటీ కేసు నమోదు చేశారు. బాధితురాలుని సుందరపేట సామాజిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధితరాలు ఇచ్చిన ఫిర్యాదు ఆదారంగా డి ఎస్పీ త్రినాథరావు గురువారం ఘటనాస్థలానికి చేరుకుని జరిగిన సంఘటనపై ఆరా తీశారు. పరారీలో ఉన్న నింధితుడు శ్రీను అరెస్టు చేసేందుకు ప్రయత్నిస్తున్నామని ఎస్సై బాలాజీరావు తెలిపారు.