క్రైమ్/లీగల్

కాశ్మీర్‌లో హిమ‘పాశం’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనగర్, జనవరి 18: కాశ్మీర్‌లో శుక్రవారం జరిగిన హిమపాత ప్రమాదంలో పది మంది దర్మరణం చెందారు. లడక్ ప్రాంతంలోని ఖార్దుంగ్‌ల ప్రాంతంమీదుగా వెళుతున్న రెండు లారీలను హిమపాతం ముంచెత్తడంతో ఈ ప్రమాదం జరిగింది. ఐదుగురు మృతదేహాలను వెలికితీయ గలిగారు మిగతా ఐదుగురు బతికుండే అవకాశాలు లేవని అధికార వర్గాలు తెలిపాయ. ఒక ట్రక్కులో వెళుతున్న పది మంది ప్రయాణీకులు హిమపాతానికి లోనయ్యారని, రెండు ట్రక్కులను మంతు ముంచెత్తిందని పోలీసులు చెప్పారు. ఈ ఘటన శుక్రవారం ఉదయం 7 గంటలకు జరిగింది. సంఘటన ప్రదేశానికి బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ సిబ్బంది హుటావుటిన చేరుకున్నారు. ఈ ఘటనలో ట్రక్కు మట్టి పెళ్లల్లో చిక్కుకుంది. రాష్ట్ర విపత్తు సహాయ బలగాలు సంఘటన స్థలానికి చేరుకుని సహాయ చర్యలు ప్రారంభించారు. ఇంతవరకు ఐదు మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసును దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.