క్రైమ్/లీగల్

ఖైనీ ఫ్యాకెట్లు స్వాధీనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోటవురట్ల, జనవరి 19: మండలంలో పాములవాకలో ఒక వ్యక్తిం నుంచి ఐదువేలు విలువైన ఖైనీ, గుట్కా ఫ్యాకెట్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై మధుసూధనరావు తెలిపారు. ముందుగా వచ్చిన సమాచారం మేరకు పోలీసు సిబ్బంది పామువాలకలో శనివారం నిఘా ఏర్పాటు చేసారు . ఈనేపధ్యంలో నర్సీపట్నం మండలం వేములపూడి గ్రామానికి చెందిన గ్రంథి వెంకట త్రినాధరావు పోలీసులను చూసి తప్పించుకునేందుకు చూసినట్లు ఎస్సై తెలిపారు. పోలీసులు త్రినాధరావును పట్టుకుని అతని వద్ద ఉన్న బ్యాగ్‌ను తనిఖీ చేయగా ఖైనీ, గుట్క్ఫ్యాకెట్లు ఉన్నట్లు గుర్తించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

* పేకాట శిబిరంపై పోలీసులు దాడి , ఏడుగురు అరెస్ట్
మండలంలో గూడెపులోవ గ్రామంలో శనివారం సాయంత్రం పోలీసులు పేకాట శిబిరంపై దాడి చేసి ఏడుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఈదాడిలో ఎనిమిది కోడి పుంజులు, 27,950 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు. తీర్థాల పేరుతో కోడి పందాలు , చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని ఎస్సై మధుసూధనరావు హెచ్చరించారు.