క్రైమ్/లీగల్

లారీ ఢీ కొని ఒకరు మృతి, మరొకరికి గాయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇచ్ఛాపురం(రూరల్), జనవరి 21: మండలంలో బలరాంపురం చెక్‌గేటు వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. మందసకు చెందిన రంజిత్‌మహారాణా(22), ఆయన బావ నరేంద్రకుమార్‌లు ద్విచక్రవాహనంపై బరంపురంకు బయలుదేరారు. మార్గమాధ్యమంలో బలరాంపురంచెక్‌గేటు వద్ద పెట్రోల్‌బంకుకు వెళ్లి మళ్లీ రోడ్డుపైకి వస్తుండగా వెనుక నుంచి వచ్చిన లారీ ఢీ కొంది. ఈ ప్రమాదంలో రంజిత్‌మహారాణా అక్కడికక్కడే మృతి చెందగా, నరేంద్రకుమార్‌ను ఇచ్ఛాపురంప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు. మృతుడు పేదవాడు కావడంతో తండ్రి లేక తల్లితో ఉండడంతో మందసలో విషాదఛాయలు అలుముకున్నాయి.
పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్యాయత్నం
టెక్కలి, జనవరి 21: టెక్కలిలోని అక్కపువీధికి చెందిన యోగీశ్వరరావు అనే వ్యక్తి పురుగులమందు తాగి అస్వస్థతకు గురైనాడు. గమనించిన కుటుంబీకులు హుటాహుటిన టెక్కలి జిల్లా ఆసుపత్రికి తరలించి వైద్యసేవలు అందిస్తూ పరిస్థితి విషమించడంతో రిమ్స్‌కు తరలించారు. కారణాలు తెలియరాలేదు. పోలీసులకు సమాచారం అందించారు.