క్రైమ్/లీగల్

ట్రాక్టర్ బోల్తా: ఇద్దరు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాయకరావుపేట, జనవరి 21: మండలంలో నామవరం జాతీయ రహదారిపై సిమ్మెంట్ ఇటుకలతో వెళ్తున్న ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడి ఇద్దరు మృతి చెందారని ఎస్సై ఎల్.రామకృష్ణ తెలిపారు. ఈమేరకు వివరాలిలా ఉన్నాయి. తుని మండలం హంసవరంకు చెందిన చిత్తలూరి అప్పన్న(34), నత్తే భద్రరావు(40) హంసవరం నుంచి ట్రాక్టర్‌లో సిమ్మెంట్ ఇటుకలు విశాఖ జిల్లా అడ్డురోడ్డు తరలిస్తుండగా మండలంలోని నామవరం జాతీయ రహదారిపై అదుపు తప్పి బోల్తా పడిందని , గాయపడిన వారిని తుని ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చాగా అక్కడ వారు చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలిపారు. మృతుడు అప్పన్నకు భార్య, ఇద్దరు పిల్లలున్నారు. మరో మృతుడు భద్రరావుకు భార్య, ఇద్దరు పిల్లలున్నారు.