క్రైమ్/లీగల్
గోదాం దగ్ధం కేసులో ఇద్దరికి జైలుశిక్ష
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 21 January 2019
పర్చూరు, జనవరి 21: మండల పరిధిలోని అన్నంబొట్ల వారిపాలెం గ్రామంలో పొగాకు గోదాం దగ్ధం చేసిన కేసులో పెట్లూరి శ్రీనివాసరావు, గోరంట్ల నవీన్కుమార్ అనే ఇద్దరికి మూడు సంవత్సరాలపాటు జైలుశిక్ష విధించినట్లు కోర్టు జూనియర్ అసిస్టెంట్ మోహన్రావు తెలిపారు. సోమవారం కోర్టులో ఈ కేసుకు సంబంధించిన విచారణ అనంతరం సీనియర్ జడ్జి డాక్టర్ ఎస్ఎండి ఫజులుల్లా నిందితులిద్దరికి జైలుశిక్ష విధిస్తూ ఉత్తర్వులు ఇచ్చారని తెలిపారు. అదేవిధంగా ఒక్కొక్కరికి రూ. 2వేలు జరిమానా విధించారు. పొగాకు గోదాము దగ్ధం కేసు 2016లో స్థానిక పోలీసు స్టేషన్లో నమోదైనట్లు చెప్పారు. పై కోర్టు అప్పీలుకు ఫిబ్రవరి 4వ తేదీ వరకు గడువు ఇచ్చినట్లు తెలిపారు.