క్రైమ్/లీగల్

పట్టపగలు చోరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వనస్థలిపురం, జనవరి 21: గ్రామ పంచాయితీ ఎన్నికల్లో ఓట్లు వేయడానికి గ్రామాలకు వెళ్లిన ఇళ్లల్లో దొంగలు పట్టపగలే దొంగతనాలకు పాల్పడి పోలీసులకు సవాలు విసిరారు. ఈసంఘటన సోమవారం ఎల్బీనగర్ పోలీసుస్టేషన్ పరిధిలోని మల్లిఖార్జున్ నగర్‌లో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మల్లిఖార్జున్ నగర్‌లో నివాసం ఉంటున్న వెంకన్న, శ్రీనివాస్ సోమవారం గ్రామ పంచాయితీ ఎన్నికలు ఉండటంతో తమ ఇళ్లకు తాళాలు వేసి ఓట్లు వేయడానికి గ్రామాలకు వెళ్లారు. మధ్యాహ్నం సమయంలో తాళాలు పగలగొట్టి ఇంటి తలుపులు తెరిచి ఉన్నట్లు గుర్తించి పక్కంటి వారు సమాచారం ఇచ్చారు. వెంటనే ఇంటికి వచ్చి చూడగా వెంకన్న ఇంట్లో మూడు తులాలు, శ్రీనివాస్ ఇంట్లో తులం బంగారంతో పాటు కొంత నగదు దొంగిలించినట్లు గుర్తించి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.