క్రైమ్/లీగల్

రైలు కింద పడి ప్రేమికుల ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొమరాడ, జనవరి 21: విజయనగరం జిల్లా కొమరాడ మండలం శివిని గ్రామం వద్ద రైలు కిందపడి ప్రేమజంట ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బొబ్బిలి మండలం జగన్నాథపురం గ్రామానికి చెందిన సీహెచ్ చంద్రశేఖర్(19), పి కృష్ణవేణి(18) గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. కృష్ణవేణికి ఇటీవల నిశ్చితార్థం జరగడంతో ప్రేమించిన వ్యక్తిని కోల్పోతున్నానని బాధతో ప్రేమికుడు చంద్రశేఖర్‌తో కలిసి కొమరాడ మండలం శివిని సమీపంలో రైలుకింద పడి సోమవారం తెల్లవారు జామున మృతి చెందారు. మృతదేహాలను పరిశీలించిన గ్రామస్థులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రైల్వే పోలీసులు, పార్వతీపురం ఎస్‌ఐ మహేష్ సంఘటనా స్థలానికి చేరుకుని మృతుడు చంద్రశేఖర్ వద్ద ఉన్న ఆధార్‌కార్డు ఆధారంగా వివరాలు తెలుసుకుని వారి కుటుంబాలకు సమాచారం అందించారు. కుటుంబ సభ్యులు సంఘటనా స్థలానికి చేరుకుని కన్నీటి పర్యంతమయ్యారు. చంద్రశేఖర్, కృష్ణవేణి గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నప్పటికీ వేర్వేరు కులాలు కావడంతో కృష్ణవేణి తల్లిదండ్రులు వేరొక సంబంధాన్ని ఖాయపరిచారు. ఈ నేపథ్యంలో త్వరలోనే వివాహం జరిపించనున్న క్రమంలో తీవ్ర మనస్తాపంతో చంద్రశేఖర్‌కు ఈ విషయం చెప్పడంతో ఇరువురు కలిసి ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. రైల్వే పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఫైల్‌పొటో సీహెచ్ చంద్రశేఖర్, పి కృష్ణవేణి