క్రైమ్/లీగల్
హైకోర్టు వద్ద జరిగిన ప్రమాదంలో వ్యక్తి మృతి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 22 January 2019
తుళ్లూరు, జనవరి 22: అమరావతి సందర్శనకు వచ్చి హైకోర్టు ప్రాంగణం వద్ద జరిగిన ప్రమాదంలో పెద్ది భాస్కరరావు (38) అనే వ్యక్తిమృతిచెందాడు. వివరాల్లోకి వెళితే... కృష్ణాయపాలెం గ్రామానికి చెందిన భాస్కరరావు తన బావమరిదితో కలిసి ద్విచక్ర వాహనంపై రాజధాని నిర్మాణ పనులను తిలకించేందుకు వెళ్లారు. హైకోర్టును సందర్శించి బయటకు వెళ్తుండగా ఎదురుగా వస్తున్న టిప్పర్ ఢీకొట్టింది. దీంతో మోటారు సైకిల్తో పాటు టిప్పర్ కిందకు దూరిపోయిన భాస్కరరావు అక్కడికక్కడే మృతిచెందాడు.