క్రైమ్/లీగల్

సోమనాథ క్షేత్రంలో గ్యాస్ లీకేజీ: వృద్ధురాలి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వనస్ధలిపురం, జనవరి 22: వంటగదిలో గ్యాస్ లీకేజీతో మంటలు చెలరేగి వృద్ధురాలు మృతిచెందగా మరో మహిళకు తీవ్ర గాయాలైన సంఘటన వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం... వనస్థలిపురం, బీఎన్‌రెడ్డినగర్ సోమనాథ క్షేత్రంలోని వంటగదిలో అక్కడే నివాసం ఉంటున్న శృతి కీర్తి (80) లలితా (30) మంగళవారం రాత్రి 7 గంటల సమయంలో వంట చేస్తున్నారు. అదే సమయంలో ప్రమాదవశాత్తు జరిగిన సంఘటనలో గ్యాస్ లీకేజి కావడంతో ఒక్కసారిగా ఎగసిన మంటలలో శృతి కీర్తి తీవ్రంగా గాయపడి మృతి చెందగా లలితా గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. ఒక్కసారిగా వచ్చిన భారీ శబ్ధంతో పరిసర ప్రాంతాలకు చెందిన ప్రజలు భయాందోళనకు గురయ్యారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికీ చేరుకుని పూర్తి వివరాలు సేకరించి కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లుతెలిపారు.