క్రైమ్/లీగల్

మూసీలో ఇద్దరు మహిళల మృతదేహాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 22: అధునిక సాంకేతిక యుగంలోను మూడాచారాలు కొనసాగుతున్నాయి. క్షుద్ర పూజల్లో భాగంగా ఇద్దరు గుర్తు తెలియని మహిళలను మూసీ నదిలో అత్తపూర్ వద్ద బలి ఇచ్చిన్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. నగరంలో కలకలం సృష్టించిన ఈ సంఘటన నగరంలోని లాంగర్‌హౌజ్ పోలీస్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సోమవారం పౌర్ణమి కావడంతో క్షుద్ర పూజలు నిర్వహించి ఉండవచ్చని, ఈ నేపథ్యంలో ఇద్దరు మహిళలను దారుణంగా హతమార్చి చంపి ఉండవచ్చని పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం మధ్యాహ్నం మూడున్నర గంటల ప్రాంతంలో సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. శవ పరీక్షల నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. 35 నుండి 45 సంవత్సరాల వయసు కలిగిన ఇద్దరు మహిళలను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేసి అత్తపూర్ మూసీనదిలో పడేశారు. అత్తపూర్ పిల్లర్ నెంబర్ 117వద్ద మెంత కుర పండిస్తున్న సురేందర్ సింగ్ రోజు మాదిరి మెంతకుర తెపడానికి మంగళవారం మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో వెళ్లాడు. తన కాళ్లకు మహిళ శవం తగలడంతో వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో సంఘటన స్థలానికి లాంగర్‌హౌజ్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ సీహెచ్ శ్రీనివాస్, ఎస్‌ఐ బాలస్వామితో కూడిన బృందం చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. మహిళల తలకు తీవ్ర గాయాలున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసుకు సంబంధించి అన్ని కోణాల్లో విచారిస్తున్నట్లు నిందితులను వెంటనే అరెస్టు చేస్తామని పోలీసులు తెలిపారు. పోలీసులు ఐపీసీ 302 సెక్షన్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.