క్రైమ్/లీగల్

నీటి తొట్టెలో పడి చిన్నారి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కళ్యాణదుర్గం, జనవరి 23 : పట్టణంలోని ఐదుకల్లు రోడ్డులో ఉన్న ఇందిరమ్మ కాలనీకి చెందిన రాముడు కుమార్తె శిరీష్ (3) బుధవారం రాత్రి ఇంటి వద్ద నీటి తొట్టెలో పడి మరణించింది. ప్రైవేటు బస్సు క్లీనర్‌గా పని చేస్తున్న రాముడు ఇందిరమ్మ కాలనీలో కొత్తగా ఇంటిని నిర్మిస్తున్నాడు. ఇందులో భాగంగా ఇంటి ముందు ఏర్పాటు చేసిన నీటి సంపులో ఆడుకుంటూ వెళ్లిన శిరీష్ జారీ పడి పోయింది. చాలాసేపు ఎవరూ గమనించకపోవడంతో మృతి చెందింది. ఇంటి పరిసరాలన్నీ వెతికినా ఫలితం లేకపోవడంతో సంపులో చూశారు. దీంతో చిన్నారి శవాన్ని చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు.
వ్యక్తి ఆత్మహత్య
మడకశిర, జనవరి 23 : మండలంలోని గుర్రపుకొండకు చెందిన మంజునాథ్ (23) ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మంజునాథ్ భార్య కొంతకాలంగా పుట్టినింట్లోనే ఉంటోంది. కాపురానికి రమ్మని చెప్పినా రాకపోవడంతో జీవితంపై విరక్తి చెంది బుధవారం ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈమేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.