క్రైమ్/లీగల్

రెండో తరగతి బాలికపై టీచర్ లైంగికదాడి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆగిరిపల్లి, జనవరి 24: ప్రభుత్వ పాఠశాలలో రెండవ తరగతి చదువుతున్న బాలికపై ఉపాధ్యాయుడు లైంగిక దాడికి పాల్పడినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కృష్ణాజిల్లాలో మండల కేంద్రమైన ఆగిరిపల్లి గ్రామానికి చెందిన బాలిక (8) స్థానిక మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో రెండవ తరగతి చదువుతోంది. ఈ నెల 22వ తేదీన పాఠశాల నుండి సాయంత్రం ఇంటికి వచ్చిన బాలిక మర్మాంగం నుంచి తీవ్రంగా రక్తస్రావం అవుతోంది. దీంతో వెంటనే తల్లిదండ్రులు నూజివీడులోని ప్రైవేటు ఆసుపత్రికి తీసుకువెళ్ళగా కుట్లు వేసి ప్రథమ చికిత్స అందించారు. పాఠశాలలో ఉపాధ్యాయుడు కొట్టినట్లుగా బాలిక చెబుతోందని తల్లి స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు ఇచ్చినట్లు డీఎస్పీ జి ప్రసాదరావు గురువారం సాయంత్రం విలేఖరులకు తెలిపారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ విషయమై దర్యాప్తు జరిపి చర్యలు తీసుకుంటామని చెప్పారు.హనుమాన్‌జంక్షన్ సీఐ ఎం రాజశేఖర్ ఈ కేసును దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ ప్రసాదరావు తెలిపారు. ఈ సమావేశంలో ఆగిరిపల్లి ఎస్‌ఐ ఏసేబు పాల్గొన్నారు. ఇలాఉంటే బాలికపై ఉపాధ్యాయుడు అత్యాచారం చేశారనే అనుమానం ఉందని బాధితురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. జిల్లా కలెక్టర్ లక్ష్మీకాంతం ఆదేశాల మేరకు జరిగిన సంఘటనపై వాస్తవాలు సేకరించేందుకు ఐసీడీఎస్ అధికారులు రంగప్రవేశం చేశారు. చిన్నారి బాలికపై ఉపాధ్యాయుడు అత్యాచారం చేసినట్లు తమ విచారణలో తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని ఐసీడీఎస్ జిల్లా ప్రాజెక్టు అధికారి కె కృష్ణకుమారి విలేఖరులకు తెలిపారు.