క్రైమ్/లీగల్

విద్యుత్ షాక్‌తో విషాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, ఫిబ్రవరి 3: విద్యుత్ షాక్‌తో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృత్యువాత పడ్డారు. లావేరు మండలం కొత్తరౌతుపేటలో ఆదివారం విద్యుత్‌షాక్‌తో ఒకే కుటుంబానికి చెందిన ఆబోతుల రాములు (55), అతని భార్య పుణ్యావతి(50), రౌతు బంగారమ్మ(45), కొమ్ము వెంకన్న(48) మృతి చెందారు. ఆదివారం మధ్యాహ్నం సమయంలో అరటి తోటలో గెలలు కోస్తుండగా ఆ తోట మీదుగా హై-టెన్షన్ కరెంటు సరఫరా తీగెలు వేలాడుతుండడంతో తగిలి ఈ ప్రమాదం సంభవించింది. అక్కడికక్కడే నలుగురూ మృతి చెందారు. అయితే, వెంకన్న కుమారుడుకి సోమవారం నిశ్చితార్థం కావడంతో అరటి గెలల కోసం తోట వద్దకు వెళ్ళి గెలలు కోస్తుండగా వేలాడుతున్న విద్యుత్ తీగెలు వారిపాలిట యమపాశంగా మారాయి. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహిస్తున్నారు.