క్రైమ్/లీగల్

అత్యాచారం కేసులో నిందితుడి అరెస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీడిమెట్ల, ఫిబ్రవరి 5: బాలికపై అత్యాచార యత్నానికి పాల్పడిన ఓ వ్యక్తిని పేట్‌బషీరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా సరూర్‌నగర్, గుర్రంగూడకి చెందిన జంగయ్య కుమారుడు బొల్లు సాయి గణేశ్ (23) బతుకుదెరువు నిమిత్తం నగరానికి వచ్చి వాజ్‌పేయ్‌నగర్ ఉంటున్నాడు. పరిసర ప్రాంతంలోని మైనర్ బాలిక నాలుగు రోజులుగా కనిపించకుండా పోవడంతో కుటుంబసభ్యులు పేట్‌బషీరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదృశ్య కేసు నమోదు చేసుకుని దర్యాప్తును చేపట్టారు. బాలికను తీసుకువెళ్లి అత్యాచార యత్నానికి పాల్పడిన నిందితుడు సాయి గణేశ్‌ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.