క్రైమ్/లీగల్

దొంగల ముఠా అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షాబాద్, ఫిబ్రవరి 5: అంతర్ రాష్ట్ర దొంగల ముఠాను అరెస్టు చేసిన సంఘటన చేవెళ్ల పోలీసుస్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. చేవెళ్ల సీఐ గురువయ్య గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం - మండల పరిధిలోని సంకెపల్లిగూడ గ్రామ శివారులోని భారత్ గ్యాస్ గోదాంలో 2017 సంవత్సరంలో అర్థరాత్రి భారత్ గ్యాస్ గోదాం నుంచి గుర్తుతెలియని వ్యక్తులు 137 గ్యాస్ సిలిండర్లు దొంగిలించుకొని పోయారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. టాస్క్ఫోర్స్ పోలీసు అధికారుల చొరవతో మహారాష్ట్ర నాందెడ్‌కు చెందిన షేక్ సాదుల (52), షేక్ జావిద్ (23), షేక్ ఇజాజ్ ఉసేన్ (29)ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. రెండు లక్షల రూపాయలను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ పేర్కొన్నారు.