క్రైమ్/లీగల్

చోరీకి గురైన గంటలోపే వాహనం పట్టివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మడకశిర, ఫిబ్రవరి 7 : స్థానిక ప్రభుత్వాసుపత్రి సమీపంలో చోరీకి గురైన వాహనాన్ని స్థానిక పోలీసులు గంటలోపే స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. స్థానిక ఆసుపత్రి ఆవరణలో రోగులను ఇతర ప్రాంతాలకు తరలించేందుకు కొందరు ప్రైవేటు అంబులెన్స్‌లను నిర్వహిస్తున్నారు. ఇందులో ఓ అంబులెన్స్‌ను బుధవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దొంగలించుకెళ్లారు. అయితే మండలంలోని సిద్ధగిరి వద్ద అంబులెన్స్ యజమాని స్నేహితుడు దాన్ని గమనించి వెంటనే సమాచారం అందించాడు. దీంతో యజమాని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో గస్తీ తిరుగుతున్న పోలీసులు ద్విచక్ర వాహనంలో వెంబడించి గుడిబండ మండలం మేకలగట్ట వద్ద అంబులెన్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. అయితే చోరీకి పాల్పడిన వ్యక్తులు వాహనాన్ని వదిలి పరారయ్యారు. దీనిపై కేసు నమోదు చేసి దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. కాగా అదే రోజు రాత్రి మధుగిరి రహదారిలో హోటల్ నిర్వహిస్తున్న యజమాని ద్విచక్ర వాహనం చోరీకి గురైనట్లు బాధితుడు పేర్కొన్నారు.