జాతీయ వార్తలు
ఏసీబీకి చిక్కిన గుర్రంకొండ తహశీల్దార్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 21 March 2018
గుర్రంకొండ, మార్చి 20: చిత్తూరు జిల్లా గుర్రంకొండ తహశీల్దార్ రవిచంద్రన్ మంగళవారం ఒక రైతునుంచి లంచం తీసుకుంటుండగా ఎసిబి అధికారులకు చిక్కారు. అధికారులకు పట్టుబడ్డారు. మండలం లోని టి.రాచపల్లె పంచాయతీ ఎగువబురుజుపల్లెకు చెందిన గోపాల్రెడ్డి తన భూమి సర్వేచేయించాలని మీ సేవలో దరఖాస్తు చేసుకున్నారు. రోజులు గడిచినా సర్వేచేయకపోవడంతో తహశీల్దార్ను అడిగితే 75వేలు లంచం కావాలని డిమాండ్ చేశాడు. చేసేదిలేక 60వేలు ఇస్తానని ఒప్పందం చేసుకుని గోపాల్రెడ్డి ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఏసీబీ అధికారులు పథకం ప్రకారం గోపాల్రెడ్డి 60వేలు తహశీల్దార్ రవిచంద్రన్కు ఇస్తుండగా రెడ్హ్యాండెడ్గా పట్టుకుని నెల్లూరు ఏసీబీ కోర్టుకు తరలించారు.