క్రైమ్/లీగల్
దేవరయాంజాల్లో కాల్పుల కలకలం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
జీడిమెట్ల, ఫిబ్రవరి 17: దేవరయాంజాల్లో కాల్పుల కలకలం రేగింది. భూ వివాదంతో ఓ వ్యక్తి గన్తో ఎదుటి వ్యక్తిపై కాల్పులు జరిపిన సంఘటన పేట్బషీరాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కొంపల్లి గ్రామంలోని జీఎల్ఆర్ అపార్ట్మెంట్లో నివాసముండే పిసారి నర్సింహా రెడ్డి (60) వ్యవసాయం చేస్తుంటాడు. ఇతని కుమారుడు మహిపాల్ రెడ్డి (29) శామీర్పేట్ మండలం దేవరయాంజాల్ గ్రామంలో స్థలంలో రాతి కడీలను పాతుతున్నాడు. దేవరయాంజాల్లో నివసించే వేణుగోపాల్ రెడ్డి (38) వ్యాపారం చేస్తుంటాడు.
కారులో వచ్చిన వేణుగోపాల్ రెడ్డి తన స్థలంలో ఎందుకు కడీలను పాతుతున్నావని ప్రశ్నిస్తూ మహిపాల్ రెడ్డి కాలర్ను పట్టుకుని దూషిస్తూ దాడికి పాల్పడ్డాడు. మహిపాల్ రెడ్డి నెట్టేయడంతో వెంటనే వేణుగోపాల్ రెడ్డి కారు డిక్కీలో నుంచి గన్ తీసి లోడ్ చేసి మహిపాల్ రెడ్డిపై కాల్పులు జరిపాడు. మహిపాల్ రెడ్డి తప్పించుకోవడంతో ప్రక్కనే ఉన్న గోడకు బుల్లెట్లు తగిలాయి. కాల్పుల నుంచి తప్పించుకున్న మహిపాల్ రెడ్డి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. పేట్బషీరాబాద్ పోలీసులకు నర్సింహా రెడ్డి ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.