క్రైమ్/లీగల్

కూలీలపై దూసుకెళ్లిన కారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శామీర్‌పేట, ఫిబ్రవరి 17: కూలి పనికి వెళుతున్న వారిపై కారు దూసుకెళ్లడంతో ఇద్దరు మహిళా కూలీలు మృతి చెందగా, నలుగురికి తీవ్ర గాయాలైన సంఘటన శామీర్‌పేట పోలీసుస్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం తూంకుంట మన్సిపాల్టీ పరిధిలోని దేవరయాంజాల్‌కు చెందిన కౌకూరు లక్ష్మీబాయి (41), తూంకుంటకు చెందిన ఎ.పూనం (32), పాడి గాయత్రి, పి.నాగలక్ష్మీ, రామలక్ష్మీ, గుండూరీ రాధమ్మ అలంకృత రీసార్ట్స్‌లో కూలి పని చేస్తూ జీవనం వెళ్లదీస్తున్నారు. రోజు మాదిరిగానే ఆదివారం ఉదయం రాజీవ్ రహదారి పక్కన నడుచుకుంటూ పనికి వెళుతుండగా వెనుక నుండి కారు అతివేగంగా అజాగ్రత్తగా వస్తూ ఈ ఆరుగురిపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో లక్ష్మీబాయి అక్కడిక్కడే మృతి చెందగా తీవ్ర గాయాలైన పూనం, గాయత్రి, నాగలక్ష్మీ, రామలక్ష్మీ, రాధమ్మలను చికిత్స నిమిత్తం 108 వాహనంలో తరలిస్తుండగా మార్గమధ్యలో పూనం మృతి చెందింది. గాయాలైన క్షతగాత్రులను అల్వాల్‌లోని జూబ్లీ ఆసుపత్రిలో చేర్పించారు. శామీర్‌పేట పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు.