క్రైమ్/లీగల్

మందు బాబులకు జైలు, జరిమానా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముకరంపుర కరీంనగర్, మార్చి 22: మద్యం సేవించి వాహనాలు నడిపిన కేసుల్లో 40 మంది మందు బాబులకు జైలుశిక్ష, జరిమానా విధిస్తూ గురువారం జిల్లాలోని వివిధ న్యాయస్థానాల్లో న్యాయమూర్తులు తీర్పునిచ్చారు. ఇందులో 14 మందికి జరిమానా, పది మందికి శ్రమదానం, మిగతా వారికి జైలుశిక్షలు విధించారు. 40 మంది మందుబాబులకు రూ.51,600 జరిమానా విధించారు.
డ్రోన్ కెమెరాకు చిక్కిన ముగ్గురు
మానకొండూర్ శివారు బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తున్న ముగ్గురు మందు బాబులను పోలీసులు డ్రోన్ కెమెరా సహాయంతో పట్టుకున్నారు. వీరిపై మానకొండూర్ పోలీస్ స్టేషన్‌లో కేసులు నమోదు చేశారు. అలాగే మానేరు డ్యాం శివారు బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తున్న ఇద్దరు మందు బాబులను లేఖ్ పోలీసులు పట్టుకున్నట్లు ఎస్‌ఐ రవి కుమార్ తెలిపారు. వీరిపై వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసులు నమోదు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.
రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి
కోరుట్ల, మార్చి 22: కోరుట్ల పట్టణ శివారులోని కృష్ణ మందిరం ఎదుట జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. కోరుట్ల ఎస్‌ఐ రవి కుమార్ తెలిపిన వివరాల ప్రకారం..కోరుట్ల పట్టణానికి చెందిన శ్రీపాద సత్యం (48) అనే వ్యక్తి తన ద్విచక్ర వాహనంపై కోరుట్ల నుండి కృష్ణ మందిరం వైపు వెళ్తుండగా ఎవరో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో సత్యం అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. స్థానికుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.