క్రైమ్/లీగల్

ఘోర రోడ్డు ప్రమాదం ..8 మంది దుర్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేవరకొండ / కొండమల్లేపల్లి, మార్చి 6: నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లి మండలం హైద్రాబాద్ - సాగర్ రహదారిపై చెన్నారం స్టేజీ సమీపంలో బుదవారం ఆర్టీసీ బస్సును ఆటో ఢీకొట్టిన ప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందారు. వీరిలో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందగా ఆటో డ్రైవర్ మహేశ్ హైద్రాబాద్‌కు తరలిస్తుండగా మృతి చెందాడు. మృతి చెందిన వారిలో ముగ్గురు మహిళలు, ఐదుగురు పురుషులు ఉన్నారు. ఈ సంఘటనకు సంబంధించి పోలీస్‌లు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. దేవరకొండ ఆర్టీసీ డిపో నుండి సంతోష్‌నగర్ కు వెళ్తున్న ఏపీ 24 జడ్ 0060 నెంబర్ గల బస్సు కొండమల్లేపల్లి దాటి చెన్నారం స్టేజీ సమీపం లోకి రాగానే మాల్ నుండి కొండమల్లేపల్లి వైపుకు ప్యాసింజర్‌లతో వస్తున్న టీ ఎస్ 05యుసీ 6934 నెంబర్ గల టాటామ్యాజిక్ ఆటో టైర్ పగిలిపోవడంతో ఆటో అదుపు తప్పి ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును బలంగా ఢీ కొట్టింది. దీంతో 16 మంది ప్యాసింజర్‌లతో వస్తున్న ఆటోలో ముగ్గురు మహిళలతో సహా ఐదుగురు వ్యక్తులు మృతి చెందారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి వివరాలిలా ఉన్నాయి. చింతపల్లి మండలం నెల్వలపల్లి గ్రామానికి చెందిన చెట్టిపల్లి రాములమ్మ (45), చింతపల్లి మండలం మాల్లారెడ్డిపల్లి గ్రామానికి చెందిన బైకని గోవర్ధన్ (26), కొండమల్లేపల్లి కి చెందిన నీల వెంకటేశం (50), హైద్రాబాద్ కు చెందిన ఆకుల శ్రీనాధ్ (23), చండూరు మండలం అంగడిపేట గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ కాటంపాక మహేశ్ (28) లు మృతి చెందారు. మృతి చెందిన మరో ముగ్గురు వివరాలు అందలేదు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ ఎనిమిది మందిలో పరిస్ధితి విషమంగా ఉన్న చింతపల్లి మండలం కొక్కిరాల మాన్‌సింగ్ తండాకు చెందిన ఒకే కుటుంబానికి చెందిన కొర్ర జంగు, కొర్ర మంగు, కొర్ర వౌనిక, కొర్ర ఝాన్సీ, చింతపల్లి మండలం నెల్వలపల్లి గ్రామానికి చెందిన తిరుపతమ్మ లను మెరుగైన చికిత్స కోసం హైద్రాబాద్‌కు తరలించారు. మిగిలిన ముగ్గురు దేవరకొండ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారి పూర్తి వివరాలను తెలుసుకునేందుకు పోలీస్‌లు ప్రయత్నిస్తున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు కొండమల్లేపల్లి ఎస్ ఐ శ్రీనివాస్‌నాయక్ తెలిపారు.

చిత్రం.. ప్రమాదంలో నుజ్జునుజ్జైన ఆటో