క్రైమ్/లీగల్
అక్రమంగా మట్టి తరలిస్తున్న లారీలు సీజ్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Thursday, 7 March 2019
మేడ్చల్, మార్చి 6: ప్రభుత్వ భూమి నుంచి అక్రమంగా మట్టిని తరలిస్తున్న రెండు లారీలను రెవెన్యూ అధికారులు సీజ్ చేశారు. మండలంలోని బండమాదారం గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 248 ప్రభుత్వ భూమిలో నుంచి మంగళవారం రాత్రి కొందరు అక్రమంగా టిప్పర్ లారీలతో మట్టిని తరలిస్తుండగా గ్రామస్థులు గమనించి రెవెన్యూ అధికారులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న అధికారులు అక్రమంగా మట్టిని తరలిస్తున్న రెండు లారీలను వాల్టా చట్టం ప్రకారం సీజ్ చేశారు. అక్రమంగా మట్టిని తరలించేవారిని గుర్తించి సంవత్సరం వరకు బైండోవర్ చేయనున్నట్లు తహశీల్దార్ వెంకట్ రెడ్డి పేర్కొన్నారు.