క్రైమ్/లీగల్

లారీ ఢీకొని వ్యక్తి దుర్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేడ్చల్, మార్చి 6: లారీ ఢీకొని వ్యక్తి దుర్మరణం చెందిన సంఘటన మేడ్చల్ పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ గణేశ్ తెలిపిన వివరాల ప్రకారం మెదక్ జిల్లా శివంపేట్ మండలం దొంతికుంట గ్రామానికి చెందిన వీ. కృష్ణారెడ్డి(45) వ్యవసాయదారుడు. బుధవారం సాయంత్రం గ్రామం నుంచి మేడ్చల్ వైపు ద్విచక్ర వాహనంపై వస్తుండగా మార్గమధ్యలో శ్రీరంగవరం గ్రామ పరిధిలో లారీ ఢీకొనడంతో బైక్‌పై నుంచి తలకు తీవ్రగాయాలై అక్కడే తుదిశ్వాస విడిచాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.