క్రైమ్/లీగల్

భార్యను కత్తితో పొడిచి తాను పొడుచుకున్న భర్త

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వనస్థలిపురం, మార్చి 11: కుటుంబ తగాదాల కారణంగా భార్యను కత్తితో పొడిచి తాను కూడా పొడుచుకున్న సంఘటన వనస్థలిపురం పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. స్థానింగా సంచలం కలిగించిన సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. నకిరేకల్ ప్రాంతానికి చెందిన మారెడ్డి చెన్న కృష్ణారెడ్డి (58) భార్య పద్మజ (48) బ్రతుకు దెరువుకోసం నగరానికి వచ్చి వనస్థలిపురం, బీడీఎల్ కాలనీలో నివాసం ఉంటున్నారు. కొంత కాలంగా భార్యాభర్తల మధ్య కుటుంబ తగాదాలు చోటు చేసుకుంటున్నాయి. సోమవారం సాయత్రం ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగి ఆవేశానికి లోనైన చెన్న కృష్ణారెడ్డి భార్య పద్మజను ఇంట్లో ఉన్న కత్తితో కడుపులో పొడిచాడు. రక్తపు మడుగులో పడి ఉన్న భార్యను చూసి అదే కత్తితో తాను కూడా కడుపులో పొడుచుకున్నాడు. ఇద్దరూ తీవ్రంగా గాయపడి రక్తపు మడుగులో పడి ఉండగా సంఘటన చూసిన ఇరుగు పొరుగువారు వెంటనే ఇద్దరిని ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న భార్యాభర్తల ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని, ఎలాంటి ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపినట్లు కుంటుంబ సభ్యులు చెప్పారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.