క్రైమ్/లీగల్
అనుమానాస్పదస్థితిలో మహిళ మృతి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 19 March 2019
ఉప్పల్, మార్చి 18: అనుమానాస్పదస్థితిలో మహిళ మృతి చెందిన సంఘటన మేడిపల్లి పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం... బోడుప్పల్ అన్నపూర్ణకాలనీలో నివసిస్తున్న కంబాల సీతారామయ్య భార్య భారతి (35) ఇద్దరు పిల్లలు. అయినప్పటికీ కుటుంబ సంసారం విషయంలో తరుచూ గొడవలు జరుగుతున్నాయని అన్నారు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి భార్యాభర్తలు గొడవ పడ్డారు. సోమవారం ఉదయం ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తుండగా తల్లిదండ్రులు ఆత్మహత్య కాదని, అత్తింటివారే హత్య చేశారని ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రఘురామ్ తెలిపారు.