క్రైమ్/లీగల్

రోడ్డు ప్రమాదంలో నలుగురు దుర్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుత్తి: అనంతపురం జిల్లా గుత్తి సమీపంలో జాతీయ రహదారిపై మంగళవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. నిలిచిఉన్న లారీని అంబులెన్స్ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతులు గుంటూరు జిల్లా నరసారావుపేట ఎస్‌ఆర్ గేట్ కాలనీకి చెందిన షేక్ మస్తాన్‌వలీ, షేక్ బాజీ, గౌస్ ఇస్మాయిల్, మణికంఠగా గుర్తించారు. యంత్రాల మరమ్మతుకోసం రైలులో డోన్ చేరుకున్నారు. అక్కడి నుంచి అనంతపురం వెళ్లేందుకు అంబులెన్స్ ఎక్కారు. వీరు ప్రయాణిస్తున్న అంబులెన్స్ గుత్తి పట్టణ శివారులో నిలిచిఉన్న లారీని ఢీకొంది. దీంతో అంబులెన్స్‌లో ఉన్న షేక్ మస్తాన్‌వలి (40), షేక్ బాజీ (35), మణికంఠ (35)తో పాటు మరో గుర్తు తెలియని వ్యక్తి (26) అక్కడిక్కడే మృతి చెందాడు. గౌస్ ఇస్మాయిల్, అంబులెన్స్ డ్రైవర్ నాగేంద్ర తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులు ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.