క్రైమ్/లీగల్

నిమ్స్‌లో చోరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్, మార్చి 19: నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగికి సహాయకుడిగా ఉన్న వ్యక్తి డబ్బు చోరీకి గురైంది. పంజాగుట్ట పోలీసుల కథనం ప్రకారం మర్పల్లికి చెందిన జగన్నాథ రెడ్డి తన బావ నర్సింహా రెడ్డి అనారోగ్యంతో బాధపడుతుండటంతో నిమ్స్‌కు తీసుకువచ్చారు. ఎమర్జెన్సీ వార్డులో నర్సింహా రెడ్డి చికిత్స పొందుతుండగా, విశ్రాంతి శాలలో జగన్నాథ రెడ్డి వేచి ఉన్నారు. నిద్రలో ఉండగా జేబులోని రూ.10వేలు చోరీకి గురయ్యాయి. పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీసీ కెమెరాలను పోలీసులు పోలీసులు పరిశీలించి ఓ వ్యక్తే ఈ చోరీకి పాల్పడట్టు గుర్తించారు. కేసు నమోదు చేసి నిందితుని కోసం గాలిస్తున్నారు.