క్రైమ్/లీగల్
రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 20 March 2019
ఉప్పల్, మార్చి 19: అతి వేగం..డ్రైవర్ నిర్లక్ష్యం డ్రైవింగ్తో ఓ యువకుడు అక్కడిక్కడే మరణించగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన మేడిపల్లి పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కధనం ప్రకారం నాగోల్ మమతానగర్లో నివసిస్తున్న ఆండ్రం(22) మరో ఇద్దరు గుజ్జార్ (22), రంజిత్ గుజ్జార్ (25) కలిసి హోండా ఆక్టివపై కాచవానిసింగారంలో ఫంక్షన్ వెళ్లి వస్తుండగా ప్రమాదవశాత్తు పర్వతాపూర్ మానస ఎన్క్లేవ్ వద్ద వేగంగా వచ్చిన ఓనీ వ్యాన్ ఢీకొంది. డ్రైవర్ నిర్లక్ష్యంతో నడిపి ప్రమాదానికి కారణమైనందున ఆండ్రం తీవ్రంగా గాయపడి అక్కడిక్కడే మరణించారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. భక్రం ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రఘురామ్ తెలిపారు.