క్రైమ్/లీగల్

మహమ్మద్ షఫీ షా సహా ఆరుగురి ఆస్తులు అటాచ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 19: జమ్మూకాశ్మీర్‌లో నిషేధిత పాక్ హిజ్‌బుల్ ముజాహిద్దీన్, సయ్యద్ సలాఉద్దీన్ అనే ఉగ్రవాదులకు ఆర్థిక సహాయం చేస్తున్న కేసుకు సంబంధించి బండిపురాకు చెందిన మహమ్మద్ షఫీ షాతోపాటు మరో ఆరుగురు స్థానికులకు చెందిన 13 ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అటాచ్ చేసింది. నిషేధిత పాక్ టెర్రరిస్టు గ్రూపునకు చెందిన హిజ్‌బుల్ ముజాహిద్దీన్, సయ్యద్ సలాఉద్దీన్‌లకు స్థానికంగా ఆర్థిక సహాయం చేస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో కేంద్ర దర్యాప్తు సంస్థ ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ యాక్ట్ (పీఎంఎల్‌ఏ) కింద మహమ్మద్ షఫీ షాతోపాటు జమ్మూకాశ్మీర్‌కు చెందిన ఆరుగురు వ్యక్తులకు సంబంధించిన 1.22 కోట్ల రూపాయల విలువగల 13 ఆస్తులను ఎటాచ్ చేస్తున్నట్టు ఈడీ పేర్కొంది. నిషేధిత ఉగ్రవాదులకు ఆర్థిక సహాయం చేస్తున్నారన్న ఆరోపణలతో కేంద్ర దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) సూచనల మేరకు ఆ ఏడుగురు వ్యక్తులకు సంబంధించిన ఆస్తులను అటాచ్ చేసినట్టు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ స్పష్టం చేసింది.