క్రైమ్/లీగల్

బందరులో బాంబు కలకలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, మార్చి 20: జిల్లా కేంద్రం మచిలీపట్నంలో బుధవారం బాంబులు కలకలం సృష్టించాయి. సుకర్లాబాద్‌లోని ఓ వివాహిత మహిళ ఇంట్లో బయటపడిన రెండు బాంబులు పట్టణ వాసులను ముచ్చెమటలు పట్టించాయి. మరొక వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న అనుమానంతో ఆ వివాహిత మహిళను మట్టుపట్టేందుకు భర్తే తన మీద అనుమానంతో ఈ బాంబులను పెట్టినట్టు బాధిత మహిళ పేర్కొంటోంది. ఇందుకు సంబంధించి వివరాల్లోకి వెళితే కోనేటి సుగుణ (28) అనే వివాహిత మహిళ గత మూడేళ్లుగా భర్త చంద్రశేఖర్‌ను వదిలేసి తన ఇద్దరు పిల్లలతో సుకర్లాబాదలో ఒకటే ఉంటోంది. అయితే ఈమె మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పర్చుకుందన్న అనుమానంతో భర్తే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. సుగుణ ఉదయానే్న తలుపు తీయగా ఒక్కసారిగా భారీ శబ్దంతో బాంబు పేలింది. తలుపు తునాతులకలైంది. దీంతో ఉలిక్కి పడ్డ ఆమె పోలీసులకు సమాచారం ఇచ్చింది. విచారణకు వచ్చిన పోలీసులకు ఆ ఇంటి ఆవరణలో మరో బాంబు ప్రత్యక్షమైంది. ఒక స్కూటీ స్టాంక్‌కు కెమికల్ వాటర్‌ను సీసాలో పోసి బాంబు అమర్చడాన్ని గుర్తించారు. బాంబు స్క్వాడ్ బృందం దాన్ని నిర్వీర్యం చేశారు. అయితే ఈ బాంబులను పెట్రో కెమికల్ బాంబులుగా భావిస్తున్నారు. వీటిని ల్యాబ్‌కు పంపి నిర్ధారణ చేస్తామని డీఎస్పీ మొహబూబ్ బాషా తెలిపారు. నిందితుడిగా భావిస్తున్న చంద్రశేఖర్ కోసం రెండు ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ బాషా తెలిపారు.