క్రైమ్/లీగల్

ఇద్దరు పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వినుకొండ, మార్చి 22: కుటుంబ కలహాల నేపథ్యంలో ఇద్దరు పిల్లలను బావిలో తోసి చంపేసి, తరువాత తల్లి కూడా ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడగా, కొంత సేపటికే తండ్రి కూడా ఆత్మహత్యాయత్నం చేసి ఆసుపత్రి పాలైన సంఘటన గుంటూరు జిల్లాలో జరిగింది. వినుకొండ మండలం గోకనకొండ గ్రామానికి చెందిన వల్లెం ఏడుకొండలు భార్య నారాయణమ్మ (30) కుటుంబ కలహాలను భరించలేక కుమారుడు అనంత కోటేశ్వరరావు (7), కుమార్తె వెంకట లక్ష్మీ (4)లను బావిలోకి తోసేసి వారు చనిపోయిన అనంతరం, ఆమె కూడా ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న ఆమె భర్త ఏడుకొండలు (32) పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. ప్రస్తుతం అతడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. వినుకొండ పట్టణ సీఐ సుబ్బారావు సంఘటనా ప్రాంతానికి చేరుకొని వివరాలు సేకరిచారు. గోకనకొండ గ్రామంలో శుక్రవారం తల్లి, బిడ్డలు మృతి చెందారనే విషయాన్ని తెలుసుకున్న వైసీపీ నేత బొల్లా బ్రహ్మనాయుడు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలోని మృతదేహాలను సందర్శించి, బంధువులను పరామర్శించారు.